Flash , Flash: నిరుద్యోగ భృతి :
*** నిరుద్యోగ భృతిపై 2న ప్రకటన..! కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్, 18-35 ఏళ్ల మధ్య వdయస్కులు అర్హులు , నెలకు రూ.1500 ఇచ్చే అవకాశం ***
ఏపీలో నిరుద్యోగభృతి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (డిసెంబరు 2) శాసనసభలో ప్రకటించే అవకాశం ఉంది. పథకం అమలుకి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శాసనసభ కమిటీ హాల్లో బుధవారం (నవంబరు 29) సమావేశ aagమైంది. ఆ సందర్భంగా పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.
ప్రతిపాదనలివీ:
* కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు.
* కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్.
* ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి.
* ఇంటర్మీడియెట్పైన ఎంత విద్యార్హత ఉన్నప్పటికీ... అందరికీ ఒకేలా రూ.1500 చొప్పునే ఇవ్వాలని నిర్ణయం. విద్యార్హతల్నిబట్టి వేర్వేరు శ్లాబ్లు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ వచ్చింది. ఇంటర్మీడియెట్ చదివినా, అంతకంటే ఎక్కువ చదివినా నిరుద్యోగి నిరుద్యోగే కాబట్టి అందరికీ ఒకే శ్లాబ్ అమలు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది.
* ఒక కుటుంబంలో ఒక్కరికే.
* తెల్ల రేషన్కార్డు, ఆధార్కార్డు, ఓటరు గుర్తింపుకార్డు తప్పనిసరి
* మాగాణి భూమి అయితే రెండున్నర ఎకరాల లోపు, మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు ఉన్నవారే అర్హులు.
* సొంత కారు ఉన్నవాళ్లు అర్హులు కాదు.
* నిరుద్యోగ భృతి తీసుకుంటున్నవారిలో సామాజిక స్పృహను పెంచేందుకు స్వచ్ఛభారత్, వనం-మనం వంటి నాలుగైదు ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగిస్తారు.
* నిరుద్యోగ భృతికి అర్హులు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది వరకు ఉంటారని అంచనా.
* పథకం ప్రారంభించడానికి ముందు... ఇప్పటి వరకు ఎక్కడా నిరుద్యోగులుగా పేరు నమోదు చేసుకోనివారికి మరో అవకాశం ఇస్తారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ను ప్రారంభిస్తారు.
* ప్రతి సంవత్సరం ఏటా ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే నిరుద్యోగులుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఏడాది పొడవునా నమోదు ప్రక్రియ ఉండదు.
* ఉన్నత విద్యాభ్యాసం చేసి, నిరుద్యోగులుగా ఉన్నవారికి నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో శిక్షణనిచ్చి, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తారు. దానికయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లు, నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం నుంచి వస్తున్న నిధులు, వివిధ ఉప ప్రణాళికల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు వంటివన్నీ సమీకృతం చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు.
* వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, విభాగాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రాయితీలు పొందిన వారు నిరుద్యోగ భృతికి అనర్హులు.
*** నిరుద్యోగ భృతిపై 2న ప్రకటన..! కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్, 18-35 ఏళ్ల మధ్య వdయస్కులు అర్హులు , నెలకు రూ.1500 ఇచ్చే అవకాశం ***
ఏపీలో నిరుద్యోగభృతి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (డిసెంబరు 2) శాసనసభలో ప్రకటించే అవకాశం ఉంది. పథకం అమలుకి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శాసనసభ కమిటీ హాల్లో బుధవారం (నవంబరు 29) సమావేశ aagమైంది. ఆ సందర్భంగా పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.
ప్రతిపాదనలివీ:
* కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు.
* కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్.
* ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి.
* ఇంటర్మీడియెట్పైన ఎంత విద్యార్హత ఉన్నప్పటికీ... అందరికీ ఒకేలా రూ.1500 చొప్పునే ఇవ్వాలని నిర్ణయం. విద్యార్హతల్నిబట్టి వేర్వేరు శ్లాబ్లు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ వచ్చింది. ఇంటర్మీడియెట్ చదివినా, అంతకంటే ఎక్కువ చదివినా నిరుద్యోగి నిరుద్యోగే కాబట్టి అందరికీ ఒకే శ్లాబ్ అమలు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది.
* ఒక కుటుంబంలో ఒక్కరికే.
* తెల్ల రేషన్కార్డు, ఆధార్కార్డు, ఓటరు గుర్తింపుకార్డు తప్పనిసరి
* మాగాణి భూమి అయితే రెండున్నర ఎకరాల లోపు, మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు ఉన్నవారే అర్హులు.
* సొంత కారు ఉన్నవాళ్లు అర్హులు కాదు.
* నిరుద్యోగ భృతి తీసుకుంటున్నవారిలో సామాజిక స్పృహను పెంచేందుకు స్వచ్ఛభారత్, వనం-మనం వంటి నాలుగైదు ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగిస్తారు.
* నిరుద్యోగ భృతికి అర్హులు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది వరకు ఉంటారని అంచనా.
* పథకం ప్రారంభించడానికి ముందు... ఇప్పటి వరకు ఎక్కడా నిరుద్యోగులుగా పేరు నమోదు చేసుకోనివారికి మరో అవకాశం ఇస్తారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్సైట్ను ప్రారంభిస్తారు.
* ప్రతి సంవత్సరం ఏటా ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే నిరుద్యోగులుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఏడాది పొడవునా నమోదు ప్రక్రియ ఉండదు.
* ఉన్నత విద్యాభ్యాసం చేసి, నిరుద్యోగులుగా ఉన్నవారికి నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో శిక్షణనిచ్చి, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తారు. దానికయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లు, నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం నుంచి వస్తున్న నిధులు, వివిధ ఉప ప్రణాళికల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు వంటివన్నీ సమీకృతం చేసి ఈ పథకాన్ని అమలు చేస్తారు.
* వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, విభాగాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రాయితీలు పొందిన వారు నిరుద్యోగ భృతికి అనర్హులు.
No comments:
Post a Comment