నేడు రాజ్యాంగ దినోత్సవం- శుభాకాంక్షల
ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం గొప్పదనాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ దినోత్సవాన్ని యావత్ భారత ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. భారత సర్వసత్తాక... సార్వభౌమ...ప్రజాస్వామ్య దేశంగా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుందని దేశ ప్రజలకు హక్కులు కల్పించింది. ప్రజలు తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎంచుకునే స్వేచ్ఛను రాజ్యాంగమే కల్పించింది. భారతదేశానికి 1947ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించాక పరిపాలన వ్యవస్థను రూపొందించి రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి దేశంలోని సుప్రసిద్ధ నాయకులు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు, న్యాయకోవిదులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను నిర్వహించుకున్నారు.
1949నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆపై 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశానికి రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతి, రాష్ట్రాల రాజ్యాంగ అధిపతులుగా గవర్నర్లు ఉండేలా నిర్థేశించారు. దేశాన్ని పరిపాలించడానికి ప్రధాన మంత్రి, మంత్రి మండలి, రాష్ట్రాలను పరిపాలించడానికి సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి నిర్మాణానికి రాజ్యాంగం చోటు కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగ బాధ్యతలను అప్పగించింది. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా రూపొందించబడుతాయి. అంతేకాదు భారత ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాజ్యాంగానికి లోబడి సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు వంద రాజ్యాంగ సవరణలు చేశారు.
150ఏళ్ల పరాయి పాలనాంతరం స్వరాజ్యం సాధించింది. 1947లో స్వాతంత్య్రం సాధించినప్పటికీ పూర్తి స్థాయి రాజ్యాంగం లేక మరో మూడేళ్ల పాటు కింగ్ జార్జిఫైవ్ సారథ్యంలో ప్రభుత్వం కొనసాగింది. 1947ఆగస్టు 29న రాజ్యాంగం రూపకల్పనకు డాక్టర్ బీఆర్. అంబేద్కర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో డ్రాఫ్ట్కమిటీ వేశారు. ఆ కమిటీ... తీవ్ర మేధోమధనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది. 1947నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ అమోదించింది. కులాలు, విభిన్న మతాలు, రకరకాల కట్టూ బొట్టు ఆచార వ్యవహారాల సంఘటిత భారతావనికి స్వపరిపాలనా రూపకల్పన రాజ్యాంగ బద్దం చేశారు. 26నవంబర్ 1947, 29 ఆగస్టు 1947న అంబేద్కర్ చైర్మన్గా పండిత్ గోవింద్ వల్లబ్ పంత్, కె.ఎం. మున్నీ, అల్లాడి కృష్ణ, స్వామి అయ్యర్, ఎన్. గోపాలస్వామి, అయ్యంగార్, బీఎల్. మిట్టర్, ఎమ్డీ. సాదుల్లా, డి.పి. ఖైతావ్, ఖైతావ్ మరణానంతరం టీటీ. కృష్ణమాచారిల పర్యవేక్షణలో రెండు సంవత్సరాల 11నెలల 11 రోజులు కష్టపడి తయారు చేసిన రాజ్యాంగాన్ని ఆరున్నర దశాబ్దాల కిందట 26నవంబర్ 1949నాడు డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన సర్ధార్ వల్లభాయి పటేల్ ప్రతిపాదించి ప్రవేశపెట్టారు. అందమైన చేతిరాతతో హిందీ, ఇంగ్లీషు ప్రతులను రెండు సంవత్సరాల 11 నెలల 18రోజులు దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి 24 జనవరి 1950న 284మంది సభ్యుల సంతకాలతో అమోదించారు. రెండు రోజుల తర్వాత 26 జనవరి 1950నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
గత2 సంవత్సరాలం నుంచి ఈ దినోత్సవం...
భారత ప్రభుత్వం 2015 నుంచి ప్రతి 26వ తేది నవంబర్ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ప్రభుత్వ ఆఫీసులలో విద్యా సంస్థలలో ఈరోజు రాజ్యాంగం గురించి తెలిపిన అనుభవజ్ఞులచే ఉపన్యాసాలు, వ్యాసరచన తదితర కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఏర్పడిన 66ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని నవంబర్ 26, 2015న జరుపుకుంది.
రాజ్యాంగం మన స్పూర్తి...
రాజ్యాంగం పీఠిక ప్రజల రోజూ వారి జీవితంలో భాగంగా మారాలి. అదే మన లక్ష్యం. మన రాజ్యాంగం గురించి మరింతగా తెలుసుకునేలా ఈరోజు మనకు స్పూర్తినివ్వాలి. భారత దేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇవ్వడం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన అందరికీ ఈ దినోత్సవం ఒక నివాళు. రాజ్యాంగం ప్రజల నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. రాజ్యాంగం ద్వారానే అధికారం స్వీకరిస్తారు. రాజ్యాంగం పేరిట విధులు నిర్వహిస్తారు. కాబట్టి రాజ్యాంగానికి ఔన్నత్యం ఆపాదించాలి....సేకరణ...vikas ,అనంతసాగరం
No comments:
Post a Comment