*డీఎస్సీకి వేళాయె*
👍 నెలాఖరులోగా ప్రకటన విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.🍃*
👍 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. నెలాఖరులోగా డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
👍 ఈ నేపథ్యంలో జిల్లాలో ఖాళీలపై విద్యాశాఖ కసరత్తు చేసి ప్రభుత్వానికి వివరాలు పంపింది.
👍 భవిష్యత్తు అవసరాలు అంటే 2020 వరకూ జిల్లాలో ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే అన్ని కేటగిరీలు కలిపి 1025 పోస్టులు వున్నట్టు గుర్తించారు.
👍 వీటిలో 2017 అక్టోబర్ నెలాఖరు వున్న ఖాళీలే ఎక్కువగా వున్నాయి. 2019 ఎన్నికల సంవత్సరం కానున్నందున వచ్చే ఏడాది ఖాళీల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది.
👍 అయితే 2020 వరకు వున్న ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుని ఇప్పుడే నియమించి...ఆ మేరకు హామీ పత్రాలు ఇస్తారా? అనేది డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తేగానీ తెలియదు.
👍 2020 వరకు ఏర్పడబోయే ఖాళీలు పరిశీలిస్తే అన్ని కేటగిరీలు కలిపి స్కూల్ అసిస్టెంట్లు 410, పండిట్లు మూడు, ఎస్జీటీలు 610...వెరసి 1025గా గుర్తించారు.*
👍 ఖాళీలు గుర్తించినప్పుడు అధికారులు సంవత్సరాల వారీగా విభజించారు. వీటిలో 2017 అక్టోబర్ నెలాఖరు వరకు స్కూల్ అసిస్టెంట్లు 76, పండిట్లు ఒకటి, ఎస్జీటీలు 552 వెరసి 628గా గుర్తించారు.
👍 ఎస్జీటీలో 552లో 260 పోస్టులు బ్యాక్లాగ్ కేటగిరీకి సంబంధించినవి. అంటే తాజాగా ఏర్పడే ఖాళీలు 292 మాత్రమే.
👍 అదే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో బ్యాక్లాగ్ ఎనిమిది, తాజా ఖాళీలు 68. ఇక 2017 నవంబర్ ఒకటి నుంచి 2018 మే నెలాఖరు వరకు కేవలం 12 ఖాళీలు మాత్రమే వున్నట్టు గుర్తించారు.
👍 స్కూల్ అసిస్టెంట్లు ఆరు, ఎస్జీటీలు ఆరు ఖాళీలు అవుతాయి. 2018 జూన్ ఒకటి నుంచి 2019 మే నెలాఖరు వరకు స్కూల్ అసిస్టెంట్లు 20, ఎస్జీటీలు 24, 2019 జూన్ ఒకటి నుంచి 2020 మే నెలాఖరు వరకు స్కూల్ అసిస్టెంట్లు 23, ఎస్జీటీలు 39 ఖాళీలు అవుతాయని విద్యాశాఖ గుర్తించింది.
👍 సాధారణంగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసేనాటికి వున్న ఖాళీలను మాత్రమే దాంట్లో పొందుపర్చుతారు. అదే జరిగితే ఈ నెలాఖరులో ప్రకటన విడుదల చేసినట్టయితే 629 ఖాళీలు మాత్రమే భర్తీకి అవకాశం వుంటుంది.
👍 అలా కాదు..2008 మాదిరిగా భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో మొత్తం 1025 ఖాళీలు భర్తీ చేయడానికి అవకాశం వుంది. డీఎస్సీ అనగానే కనీసం వెయ్యి నుంచి రెండు వేల వరకు పోస్టులు భర్తీచేస్తారు.
👍 2014 డీఎస్సీలో పోస్టులను 2016లో భర్తీచేశారు. అయితే ఏటేటా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరిక తగ్గుతుంది.
👍 ప్రధానంగా ఐదో తరగతిలోపు చేరే వారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. జనాభా నియంత్రణతో కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గడం కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు.
👍 ఇంకా విద్యార్థులు తక్కువగా వున్న పాఠశాలల మూత, సమీప పాఠశాలల్లో విలీనం వంటి చర్యల వల్ల టీచర్ల సంఖ్య మిగులు చూపించారు.
👍 వీటన్నింటి నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తక్కువగా వుందనేది విద్యాశాఖ వర్గాల అభిప్రాయం.
👍 నెలాఖరులోగా ప్రకటన విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.🍃*
👍 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. నెలాఖరులోగా డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
👍 ఈ నేపథ్యంలో జిల్లాలో ఖాళీలపై విద్యాశాఖ కసరత్తు చేసి ప్రభుత్వానికి వివరాలు పంపింది.
👍 భవిష్యత్తు అవసరాలు అంటే 2020 వరకూ జిల్లాలో ఏర్పడే ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే అన్ని కేటగిరీలు కలిపి 1025 పోస్టులు వున్నట్టు గుర్తించారు.
👍 వీటిలో 2017 అక్టోబర్ నెలాఖరు వున్న ఖాళీలే ఎక్కువగా వున్నాయి. 2019 ఎన్నికల సంవత్సరం కానున్నందున వచ్చే ఏడాది ఖాళీల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది.
👍 అయితే 2020 వరకు వున్న ఖాళీలను కూడా పరిగణనలోకి తీసుకుని ఇప్పుడే నియమించి...ఆ మేరకు హామీ పత్రాలు ఇస్తారా? అనేది డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తేగానీ తెలియదు.
👍 2020 వరకు ఏర్పడబోయే ఖాళీలు పరిశీలిస్తే అన్ని కేటగిరీలు కలిపి స్కూల్ అసిస్టెంట్లు 410, పండిట్లు మూడు, ఎస్జీటీలు 610...వెరసి 1025గా గుర్తించారు.*
👍 ఖాళీలు గుర్తించినప్పుడు అధికారులు సంవత్సరాల వారీగా విభజించారు. వీటిలో 2017 అక్టోబర్ నెలాఖరు వరకు స్కూల్ అసిస్టెంట్లు 76, పండిట్లు ఒకటి, ఎస్జీటీలు 552 వెరసి 628గా గుర్తించారు.
👍 ఎస్జీటీలో 552లో 260 పోస్టులు బ్యాక్లాగ్ కేటగిరీకి సంబంధించినవి. అంటే తాజాగా ఏర్పడే ఖాళీలు 292 మాత్రమే.
👍 అదే స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో బ్యాక్లాగ్ ఎనిమిది, తాజా ఖాళీలు 68. ఇక 2017 నవంబర్ ఒకటి నుంచి 2018 మే నెలాఖరు వరకు కేవలం 12 ఖాళీలు మాత్రమే వున్నట్టు గుర్తించారు.
👍 స్కూల్ అసిస్టెంట్లు ఆరు, ఎస్జీటీలు ఆరు ఖాళీలు అవుతాయి. 2018 జూన్ ఒకటి నుంచి 2019 మే నెలాఖరు వరకు స్కూల్ అసిస్టెంట్లు 20, ఎస్జీటీలు 24, 2019 జూన్ ఒకటి నుంచి 2020 మే నెలాఖరు వరకు స్కూల్ అసిస్టెంట్లు 23, ఎస్జీటీలు 39 ఖాళీలు అవుతాయని విద్యాశాఖ గుర్తించింది.
👍 సాధారణంగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసేనాటికి వున్న ఖాళీలను మాత్రమే దాంట్లో పొందుపర్చుతారు. అదే జరిగితే ఈ నెలాఖరులో ప్రకటన విడుదల చేసినట్టయితే 629 ఖాళీలు మాత్రమే భర్తీకి అవకాశం వుంటుంది.
👍 అలా కాదు..2008 మాదిరిగా భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో మొత్తం 1025 ఖాళీలు భర్తీ చేయడానికి అవకాశం వుంది. డీఎస్సీ అనగానే కనీసం వెయ్యి నుంచి రెండు వేల వరకు పోస్టులు భర్తీచేస్తారు.
👍 2014 డీఎస్సీలో పోస్టులను 2016లో భర్తీచేశారు. అయితే ఏటేటా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల చేరిక తగ్గుతుంది.
👍 ప్రధానంగా ఐదో తరగతిలోపు చేరే వారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. జనాభా నియంత్రణతో కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గడం కూడా ఒక కారణంగా పేర్కొనవచ్చు.
👍 ఇంకా విద్యార్థులు తక్కువగా వున్న పాఠశాలల మూత, సమీప పాఠశాలల్లో విలీనం వంటి చర్యల వల్ల టీచర్ల సంఖ్య మిగులు చూపించారు.
👍 వీటన్నింటి నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తక్కువగా వుందనేది విద్యాశాఖ వర్గాల అభిప్రాయం.
No comments:
Post a Comment